జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే ….

జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు హోంమంత్రి అమిత్ షా తెలిపారు.ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అలాగే,ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ఉద్ఘాటించారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ‘డిస్ట్రిక్ట్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌’ విడుదల కార్యక్రమంలో వర్చువల్‌గా జరిగిన సమావేశంలో అమిత్‌ షా శనివారం మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధే ప్రధాని మోదీ ధ్యేయమని, అందుకు అనుగుణంగా ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి కృషి జరుగుతోందని వివరించారు.