వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రేపు సాయంత్రం లండన్ బయలుదేరబోతున్నారు. ఐదు రోజుల పాటు అక్కడే పర్యటించబోతున్నారు. జగన్ లండన్ టూర్ వెనుక కారణం ఏంటి అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో జగన్ కుమార్తె హర్ష విద్యాభ్యాసం చేస్తుంది. పాదయత్ర ప్రారంభించడానికి ముందు జగన్ లండన్ వెళ్లి కుమార్తెను కలిశారు. చాల నెలల తర్వాత మళ్లీ కుమార్తె ను చూసేందుకు జగన్ వెళ్తున్నాడు.
ఇక ఈరోజు జగన్ ను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఇద్దరు సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.