Site icon TeluguMirchi.com

జగన్ – మోడీ భేటీ హైలైట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..బుధువారం ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు. దాదాపు ఇద్దరి మధ్య గంటన్నర పాటూ భేటీ జరిగింది. ఈ భేటీ లో రాష్ట్రానికి సంబందించిన అనేక అంశాలు మోడీతో చర్చించారు. ముందు జగన్ ఎంపీలతో కలిసి 50 నిమిషాల పాటూ కీలక అంశాలపై చర్చించారు. తర్వాత మోదీతో జగన్ ఏకాంతంగా చర్చలు జరిపారు.

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ప్రధానీతో చర్చించిగినట్టు చెబుతున్నారు. శాసన మండలి రద్దు, మూడు రాజధానులపై ప్రధానికి వివరించిన సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరినట్టు సమాచారం. ఈరోజు రాత్రికి ఢిల్లీలోనే బస చేసి రేపు అమిత్ షాను కలిసే అవకాసం ఉందనుకున్నా ఆయన అపాయింట్ మెంట్ దొరకక పోవడంతో చివరి నిముషంలో అమరావతికి పయనమయ్యారు.

Exit mobile version