Site icon TeluguMirchi.com

టీడీపీ కి మరో షాక్..

మరో 18 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న గాని వైస్సార్సీపీ పార్టీ లోకి వలసలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి కీలక నేతలంతా వైసీపీ తీర్థం పుచ్చుకోగా…తాజాగా మాజీ మంత్రి, సీనియర్‌ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీకి గుడ్‌బై చెప్పే వైసీపీ లోకి చేరబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన కొత్తపల్లి.. అసెంబ్లీ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఈక్రమంలో వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. కొత్తపల్లి సుబ్బారాయుడు తిరిగి వైసీపీలో చేరేందుకు నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు.. అధినేత జగన్‌తో మాట్లాడినట్టు తెలిసింది. జగన్‌ సమక్షంలో వైసీపీలో సుబ్బారాయుడు చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీ కి మరో దెబ్బ పడ్డట్లే.

Exit mobile version