మెగా బ్రదర్ & జనసేన సభ్యుడు నాగబాబు మరోసారి సోషల్ మీడియా లో పలు కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. గత కొన్ని రోజులుగా అధికార పార్టీ వైసీపీ ఫై తీవ్ర విమర్శలు చేస్తున్న వస్తున్న నాగబాబు…తాజాగా జనసేన – బిజెపి పొత్తు ఫై వైసీపీ చేస్తున్న కామెంట్స్ ఫై స్పందించారు.
పవన్ కళ్యాణ్కు రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేదని అంబటి అన్నారు. రాజకీయ స్థిరత్వం లేని ఇలాంటి వ్యక్తిని నమ్ముకొని.. కుక్క తోక పట్టుకోని ఈదుతామంటే.. ఈదమనే అంటామని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్తో నాలుగున్నరేళ్లపాటు బీజేపీ ప్రయాణం చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం పట్ల నాగబాబు స్పందించారు.
వైఎస్సార్సీపీతో పాటూ ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారి దుఃఖాన్ని చూడలేకపోతున్నాను అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
వై సీపీ పార్టీ మరియు అంబటి రాంబాబు గారి దుఃఖాన్ని చూడలేకపోతున్నా.
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 16, 2020