Site icon TeluguMirchi.com

పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ అభిమాని ఏం చేసాడో తెలుసా..?

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అత్యధిక మెజార్టీ తో గెలిచి పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి కావాలని కోరుతూ జనసేన పార్టీ కార్య కర్త ఫయాజ్‌ . శనివారం ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు నుంచి మోకాళ్లపై దుర్గగుడికి చేరుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు.

సామాన్యులు, అన్ని కులాలు, వర్గాలకు న్యాయం జరగాలంటే పవన్‌కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలని, అధికార పార్టీ నేతలు.. జనసేన పార్టీ బలపడకుండా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఈ సందర్బంగా సదరు కార్యకర్త మీడియా కు తెలియజేసాడు. ఈ వార్త తెలుసుకున్న పవన్ అభిమానులు , జనసేన కార్య కర్తలు ఫయాజ్‌ చేసిన దానికి సెల్యూట్ చేస్తున్నారు.

Exit mobile version