Site icon TeluguMirchi.com

పవన్ మోసం ఫై ఆగ్రహం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నాడని అంత అంటున్నారు. ఎన్నికల ముందు వరకు జనసేన పార్టీ ఎన్నికల్లో చక్రం తిప్పుతుందని అంత భావించారు. కానీ చంద్రబాబు తో పవన్ రహస్య బేరాలు సాగించడం..చంద్రబాబు డైరెక్షన్లో పవన్ యాక్షన్ సాగడం తో ప్రజల్లో జనసేన ఫై పూర్తి వ్యతిరేకత వస్తుంది. మొన్నటి వరకు పవన్ రాష్ట్రాన్ని కొత్త ఆశయాలతో ముందుకు తీసుకొస్తాడని..ఎంతో భావించాం..కానీ అందరి నేతల్లాగానే డబ్బుకు దాసోహం అయ్యాడని విమర్శిస్తున్నారు. మొన్నటి వరకు టీడీపీ ఫై నిప్పులు చెరిగిన పవన్..ఇప్పుడు కేసీఆర్ ను టార్గెట్ చేసాడని..బాబు ఏ మాట చెపితే ఆ మాట పలుకుతున్నాడని అంటున్నారు. పవన్ తీరు జనసేన అభ్యర్థులకే నచ్చడం లేదని..ఇలా చేస్తారనుకోలేదని..పవన్ అసలు వ్యక్థత్వం ఇదా అని విమర్శిస్తున్నారు. అభిమానులు , కార్య కర్తలు సైతం కాస్త దూరంగానే ఉంటున్నారు.

జనసేన తో పొత్తు పెట్టుకున్న కామ్రేడ్ నేతలు సైతం ఇప్పుడు జనసేన తో తెగతెంపులు చేసుకునేందుకు సిద్దపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చెప్పిన వారికే పవన్ టికెట్స్ ఇచ్చాడని..ముందుకు మాకు కొన్ని సీట్లు ఇస్తానని..అభ్యర్థులను ఖరారు చేసిన పవన్..ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన వారికే టికెట్స్ ఇచ్చి తమను మోసం చేసారని కామ్రేడ్ నేతలు వాపోతున్నారు. ఈరోజు పొత్తా..విడిపోవడమే అనేది తేల్చుకుంటామని అంటున్నారు. మొత్తం మీద పవన్ నిజ స్వరూపం బయటకు వస్తుండడం అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version