Site icon TeluguMirchi.com

ఆంధ్రప్రజల పరువు తీసిన పవన్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రజల పరువు తీసాడని అంత మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త సైలెంట్ అయినా పవన్..మళ్లీ తన దూకుడు ను చూపిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఫై స్పందించారు. స్పెషల్ స్టేటస్‌ విషయంలో ఏ పార్టీపై కూడా ఆరోపణలు చేయకుండా డైరెక్టుగా ప్రజలపైనే విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ అయ్యింది.

అనుకున్నది సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలకున్న పట్టుదల..ఆకాంక్ష ఆంధ్రా ప్రజలకు లేదన్నారు . ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాలపాటు పోరాడితే.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలు మాత్రం అంతటి ఆకాంక్షను చూపలేకపోయారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రత్యేక హోదాపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదిసార్లు మాటలు మార్చినా ప్రజల నుండి సరైన నిరసన రాలేదన్నారు. ప్రజల నుండి బలమైన నిరసన రానంతవరకు హోదా విషయంలో తామేమీ చేయలేమని స్పష్టం చేశారు.

Exit mobile version