Site icon TeluguMirchi.com

’30 ఇయర్స్‌ పృధ్వీ ‘ తాడేపల్లి గూడెం నుండి పోటీ చేస్తాడా..?

’30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ ఇక్కడ అంటూ సినిమాల్లో తనదయిన స్టయిల్ లో నవ్వించిన పృధ్వీ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయ్యాడు. కొన్ని రోజులు ముందు వైస్సార్సీపీ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర లో జగన్‌తో కలిసి పాదయాత్రలో కొంత దూరం నడిచాడు. పార్టీ లో చేరినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ ఫై విరుచుక పడుతూనే ఉన్నాడు.

మొన్నటిదాకా తాను వైఎస్సార్సీపీ మనిషిననీ, అయితే ఆ పార్టీ తరఫున తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడంలేదనీ చెప్పిన పృధ్వీ, ఇప్పుడు సొంతూరు తాడేపల్లి గూడెం అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలనేది డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొస్తున్నాడు. ఆయన ఆ ప్రయత్నంలో ఉన్నారని టాక్. మరి జగన్ పృద్వి కోరిక తీరుస్తాడో లేదో చూడాలి.

Exit mobile version