Site icon TeluguMirchi.com

పెను ప్రమాదం నుండి బయటపడ్డ సోమిరెడ్డి ..

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లేచిన గడియ బాగుంది.పెను ప్రమాదం నుండి తృటిలో బయటపడ్డాడు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను ఎలాంటి విధ్వసం సృష్టించిందో తెలియంది కాదు..వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు సోమిరెడ్డి మూడురోజుల నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఈరోజు మందస వెళ్తుండగా హరిపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం టైరు పేలి డివైడర్‌పై దూసుకెళ్లింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పాటు మంత్రి సీటు బెల్టు పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు డివైడర్‌ను ఢీకొన్న వెంటనే మంత్రి కారు దిగి బయటకు వచ్చారు. అనంతరం మరొక కారులో ఆయన మందస వెళ్లిపోయారు. మంత్రి ప్రమాదం నుండి బయటపడడం తో తెలుగు దేశం నాయకులు , కార్య కర్తలంతా ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version