Site icon TeluguMirchi.com

టీడీఎల్పీ సమావేశానికి ఆ ఐదుగురు డుమ్మా..

తెలుగుదేశం పార్టీ టీడీఎల్పీ సమావేశం ఏర్పటు చేయగా దానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. మండలి రద్దు ప్రచారం జరుగుతుండడంతో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశం ఏర్పటు చేయగా.వివిధ కారణాలతో టీడీఎల్పీ సమావేశానికి హాజరు కాలేమని సరస్వతి, తిప్పేస్వామి, కేఈ ప్రభాకర్, శతృచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ సమాచారం అందించారు. ఒకరిఇద్దరికి పనులు ఉండొచ్చుగాని ఒకేసారి ఐదుగురికి పనులు ఉండడమేంటి అని మాట్లాడుకుంటున్నారు. అటు తమ ఎమ్మెల్సీలకు అధికార పార్టీ గాలం వేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.

Exit mobile version