Site icon TeluguMirchi.com

గుంటూరు సీటు వైసీపీ కి తలనొప్పి గా మారిందా..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల జోరు వేడి వేడిగా సాగుతుంది..అతి త్వరలో ఎన్నికలు సమరం మొదలు కాబోతుండడం తో సీట్ల పంపకంఫై కసరత్తులు జరుగుతున్నాయి. ముఖ్యం గా గుంటూరు లోక్‌సభ స్థానం టికెట్ కోసం వైస్సార్సీపీ పార్టీ లో పోటీ విపరీతం అయ్యింది. టీడీపీ నుండి గల్లా జయదేవ్ బరిలోకి దిగబోతున్నాడనే వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో గల్లా జయదేవ్‌కు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని వైసీపీ చూస్తుంది.

ప్రస్తుతం వైసీపీ ఎవర్ని దింపాలనేది ఇంకా డిసైడ్ కానప్పటికీ మాకు కావాలంటే మాకు కావాలంటూ చాలామంది జగన్ దగ్గరకు వచ్చి బేరాలు ఆడుతున్నారట. మూడు రోజుల క్రితం వైఎస్ జగన్‌ను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ మామ, ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు… గుంటూరు ఎంపీ సీటు ఇవ్వాలని జగన్‌ను కోరినట్టు ప్రచారం జరుగుతోంది. మంగళవారం జగన్‌ను కలిసిన సినీనటుడు నాగార్జున సైతం తన మిత్రుడికి గుంటూరు టికెట్ ఇవ్వాలని జగన్‌ను కోరినట్టు తెలుస్తుంది. దీంతో వైసీపీకి గుంటూరు లోక్ సభ సీటు పెద్ద తలనొప్పిగా మారింది.

Exit mobile version