అసెంబ్లీలో 9, మండలిలో 11 బిల్లులను ప్రవేశ పెట్టనున్న ఏపీ సర్కార్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నేడు అసెంబ్లీలో ఏపీ సర్కార్ 9 బిల్లులను పెట్టనుంది. ఆరోగ్య రంగంపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. అటు మండలిలో 11 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యుత్ సంస్కరణలపై, రాష్ట్రంలో రోడ్లు-రవాణా పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.