2022-23 బడ్జెట్ : వేటికి ధరలు పెరుగుతున్నాయి..వేటికి తగ్గుతున్నాయంటే..

మంగళవారం నాడు 2022-23 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, ఈ బడ్జెట్‌‌లో వేటికి ధరలు పెరుగుతున్నాయి..వేటికి ధరలు తగ్గుతున్నాయనేది చూస్తే..

ధరలు పెరిగే వస్తువుల జాబితా:

  • ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, విదేశీ గొడుగులు, క్రిప్టో లావాదేవీలు పెరగనున్నాయి.

ధరలు తగ్గేవి..

  • వస్త్రాలు
  • నగలు
  • మొబైల్ ఫోన్స్
  • మొబైల్ ఛార్జర్
  • చెప్పులు
  • స్టీల్ స్క్రాప్స్

ఈ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఐటీఆర్‌లో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి మరింత గడువు ఇచ్చింది. రెండేళ్ల గడువు ఇస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.