బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం

డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ)1961 చట్ట సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లోగా ఖాతాదారులు తమ డిపాజిట్లపై ₹5 లక్షల వరకు బీమా పొందవచ్చు. భారతదేశంలోని విదేశీ బ్యాంకు శాఖలు కూడా దీని పరిధిలోకి వస్తాయి

తాజా చట్టం వల్ల 98.3 శాతం బ్యాంకు ఖాతాదారులు ఊరట కలుగుతుంది. బీమా కింద డబ్బు పొందడానికి పూర్తి లిక్విడేషన్ తర్వాత 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ, కొత్త చట్టం వల్ల ఇప్పుడు మారటోరియం విధించినప్పటికి 90 రోజుల్లోగా ఈ ప్రక్రియ ఖచ్చితంగా పూర్తవుతుంది అని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు