ఢిల్లీలో ఒక్కరోజే 240 కరోనా మరణాలు, కొత్తగా 23686 కరోనా కేసులు

దేశ రాజధాని ఢిల్లీ లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 90,696 కరోనా పరీక్షలు నిర్వహించగా 23,686 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 8,77,146 మంది వైరస్‌ బారిన పడగా మొత్తం 76,887 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు ఢిల్లీ స్టేట్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 21,500 మంది కరోనా నుండి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 7,87,898 కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ తో 240 మంది మరణించారు.