ఏపీలో దీపావళికి టపాసులు ఆ సమయంలో మాత్రమే కాల్చాలి…

దీపావళి పండగ నాడు రాత్రి 8 గంటలనుండి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ AK పరీడా తెలిపారు. కేవలం హరిత టపాసులతోనే పండగ నిర్వహించుకోవాలని చెప్పారు. కొవిడ్‌ మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలెవరూ మామూలు టపాసులు కాల్చొద్దని అన్నారు.