EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

కొవిడ్ సంక్షోభంలో ఉద్యోగం కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కొవిడ్ సంక్షోభంలో ఉద్యోగం కోల్పోయి, తిరిగి విధుల్లో చేరిన EPF ఖాతాదారులకు 2022 వరకు ఉద్యోగుల షేర్​తో పాటు, యాజమాన్యాలు చెల్లించే మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. EPFO కింద నమోదైన సంస్థల ఉద్యోగులకే ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు.