హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరభద్ర సింగ్‌(87) కన్నుమూశారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి సూపరిండెంట్‌ వెల్లడించారు. 1934 జూన్‌ 23న హిమాచల్‌లోని సరహాన్‌ ప్రాంతంలో జన్మించిన వీరభద్ర సింగ్‌, 1960ల్లో రాజకీయాల్లోకి వచ్చారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. హిమాచల్‌ప్రదేశ్‌కు ఆరు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.