దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు

దేశంలో కరోనా రెండవ దశ నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,13,71,901 కేసులు నమోదు కాగా, ఇందులో 3,05,43,138 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,08,212 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనాతో 535 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,20,551 కి చేరింది. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 39,972 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపారు.