రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అక్టోబరు 21న తెలంగాణలోని ములుగు జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామప్ప ఆలయాన్ని సందర్శించి, ఆ చారిత్రక నిర్మాణాన్ని పరిశీలిస్తారు. అనంతరం ప్రపంచ వారసత్వ ఫలకాన్ని ఆవిష్కరించడంతోపాటు అక్కడ ప్రజా సౌకర్యాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు.