టీడీపీ కి మురళి మోహన్ గుడ్ బై చెప్పబోతున్నాడా..?

అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలుగుదేశం పార్టీ ఫై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయింది. అయినాగానీ చంద్రబాబు , లోకేష్ మాత్రం ఇంకా ప్రజల్లో టీడీపీ ఫై నమ్మకం ఉందని భ్రమలో ఉన్నారు. అయితే నేతలు మాత్రం డిసైడ్ అయిపోయి..మెల్లగా సైకిలు దిగుతూ వస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది టీడీపీ నుండి బయటకు రాగ..తాజాగా సీనియర్ నేత మురళి మోహన్ కూడా టీడీపీ గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

మురళీమోహన్ కు వయసు మీదపడుతోంది. ఇలాంటి టైమ్ లో పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండటం చాలా కష్టం. ఒకవేళ ఉండాలనుకున్నా ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారంటే బాగా కష్టం. అందులోనూ జగన్ టార్గెట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు కాబట్టే, ఇలాంటి టైమ్ లో జగన్ ను కెలక్కుండా ఉండడమే మంచిదని డిసైడ్ అయ్యారు. అందుకే రాజమండ్రి నుంచి బిచానా ఎత్తేసి, హైదరాబాద్ వచ్చేశారు. తను లోకల్ అని చెప్పుకునేందుకు రాజమండ్రిలో కట్టుకున్న ఇంటిని సైతం ఆయన అమ్మేశారని టాక్. త్వరలోనే మురళీ మోహన్ టీడీపీ ని వీడుతున్నట్లు అధికారిక ప్రకటన చేయబోతున్నారని అంటున్నారు.