తెలంగాణలో మరో నాలుగు కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా మరో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుండే ఈ నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వికారాబాద్, పరిగి, ఉప్పల్, మహేశ్వరం ప్రాంతాల్లో ఈ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం.