సొంత తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారులు, చివరికి….

స్థానిక జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ వద్ద నివాసముంటున్న కొక్కుల అనంత-నారాయణ దంపతులు తమ కుమారులు డబ్బుల కోసం ఉన్న ఇల్లు అమ్మాలని వేధిస్తున్నారంటూ.. ఆర్డీఓ శ్రీమతి మాధురికి ఫిర్యాదు చేశారు.

తమ సమస్యలపై సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు హరి అశోక్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో.. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తమగోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే ఆర్డీఓ మాధురి స్పందించి.. కొక్కుల అనంత-నారాయణ దంపతుల ముగ్గురు కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. తల్లితండ్రులను వేధించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.ఇప్పటికైనా తప్పులు గ్రహించి తల్లితండ్రులను సరిగా చూసుకోవాలని లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా తల్లితండ్రులపట్ల దౌర్జన్యంగా వ్యవహరించినా, వేధించినా నేరుగా కూడా ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు.