మజ్లిస్ నేతలను పాకిస్తాన్ పంపిస్తాం : రాజాసింగ్

బీజేపీ శాసనసభాపక్ష నేత రాజసింగ్ ఓవైసీ సోదరులపై మండి పడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశద్రోహుల పార్టీ ఎంఐఎం నేతలను పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. పాతబస్తీలో బీజేపీ సభ నిర్వహిస్తే ఓవైసీ సోదరులు ఏం చేసారని ప్రశ్నించారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం ఎంఐఎంకు అలవాటైందని విమర్శించారు. గోషామహల్ అభివృద్ధికి రూ.2 వేల కోట్ల నిధులిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. గోషామహాల్ లో కేసీఆర్ డబ్బు గెలుస్తోందో.. నేను గెలుస్తానో చూద్దామని సవాల్ విసిరారు. హుజూరాబాద్ ఎన్నికల్లోనూ గెలిచేది డబ్బులు కాదని, ఈటల మాత్రమే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేలు తీసుకుని బీజేపీకి ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ మత్తుల తెలంగాణగా మార్చాడని దుయ్యబట్టారు.