ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ హోం మంత్రి

రంజాన్ మాసం ప్రారంభాన్ని పురస్కరించకొని తెలంగాణ హోం మంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల పవిత్రతకు అనుగుణంగా తమ జీవితాలను మలచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, మాస్కలను వాడాలని, సామాజిక దూరాన్ని పాటించాలని , అనవసరంగా ఇంటి నుండి బయటకు రావద్దని హోం శాఖా మంత్రి సూచించారు.