సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ … సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్


సంక్రాంతి రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వేస్ విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపడాలని నిర్ణయించింది. జనవరి 11-17 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. జనవరి 11న రాత్రి 7.50 గంటలకు విశాఖలో బయలుదేరిన రైలు(08505) మరుసటి రోజు ఉ:7.10కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. జనవరి 11,13,16 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. మరోవైపు జనవరి 12,14,17తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 7.40కి బయలుదేరిన ప్రత్యేక రైలు (08506) తర్వాతి రోజు ఉ:8.20కి విశాఖ చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉ:8 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు.