వైఎస్ షర్మిల అరెస్ట్..

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకరావాలని పార్టీ స్థాపించిన వైస్ షర్మిల ను అరెస్ట్ చేసారు. ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు బోడు ఉప్పల్ లో దీక్ష చేపట్టారు. అయితే దీక్ష కు పోలీసులు అనుమతి నిరాకరించడం తో వైఎస్సార్టీపీ కార్య కర్తలకు , పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము శాంతియుతంగా దీక్ష చేయాలనుకుంటే.. ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించేందుకు తర్వాత షర్మిల మేడిపల్లి పీఎస్‌కు వెళ్లగా… అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో షర్మిలతోపాటు ఆమె పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు.