సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తిరుమల టూర్ షెడ్యూల్

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఈ నెల 14, 15 వ తేదీలలో తిరుపతి, తిరుమల లో పర్యటించనున్నట్టు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 వతేది గురువారం మ: 12.35 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరి 1.35 గంటలకు రేణిగుంటకి చేరుకొని తిరుపతిలో రాత్రి బస చేసి 15వ తేది మ: 2.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి బయలుదేరి 3.20 గంటలకు హైదరాబాద్ చేరుకొంటారని కలెక్టర్ ఆ ప్రకటన లో తెలిపారు.