తెలంగాణ కొత్త సిఎస్ గా ఎ.శాంతి కుమారి !


తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ సీనియర్ IAS అధికారిణి, ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఫారెస్ట్) గా ఉన్న ఎ.శాంతి కుమారి IAS ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సిఎస్ ఎ.శాంతి కుమారి మాట్లాడుతూ, నాపై ఎంతో నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాపై ఉంచిన ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తాను అని అన్నారు.