టీఎస్‌ఆర్టీసీకి సంక్రాంతి బొనాంజా… భారీగా ఆదాయం !


సంక్రాంతి పండుగ టీఎస్‌ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. సంక్రాంతి సందర్భంగా సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం వల్ల అనూహ్య స్పందన వచ్చిందని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు 11 రోజుల్లో రికార్డు స్థాయిలో 2.82 కోట్ల మంది ప్రయాణికులను టీఎస్‌ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చెరిచిందని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ సజ్జనార్‌లు తెలిపారు. సంక్రాంతికి రూ.165.46 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది గత ఏడాది కన్నా రూ.62.29 కోట్లు అదనంగా వచ్చిన ఆదాయం అని అన్నారు.