తెలంగాణ లో కొత్తగా 2251 కరోనా కేసులు, 6 మరణాలు

దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2251 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,29,529 కేసులు నమోదు కాగా, ఇందులో 3,05,900 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 21 ,864 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో గత 24 గంటల్లో కరోనాతో 6 గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1765కి చేరింది. తెలంగాణ లో ఈ రోజు 565 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపారు. ఈ రోజు GHMC పరిధిలో లో 355 , మేడ్చల్ మల్కాజ్గిరి లో 258, నిజామాబాదు లో 244 లలో అత్యధికంగా కేసులు బయటపడ్డాయి.