తెలంగాణ లో కొత్తగా 4009 కరోనా కేసులు, 14 మరణాలు

దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4009 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,55,433 కేసులు నమోదు కాగా, ఇందులో 3,14,441 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 39,154 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో గత 24 గంటల్లో కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1838 కి చేరింది. తెలంగాణ లో ఈ రోజు 1878 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటనలో తెలిపారు. ఈ రోజు GHMC పరిధిలో లో 705 , మేడ్చల్ మల్కాజ్గిరి లో 363, నిజామాబాదు లో 360 , రంగారెడ్డి లో 336 లలో అత్యధికంగా కేసులు బయటపడ్డాయి.