ఫిబ్ర‌వరి 1 నుంచి తెలంగాణ లో స్కూళ్లు రీఓపెన్‌

కరోనా కారణంగా పాఠశాలల సెలవులను పొడగించిన తెలంగాణ సర్కార్ ..ఫిబ్రవరి 01 నుండి స్కూల్స్ రీఓపెన్ చేయాలనీ ఆదేశాలు జారీచేసింది. స్కూళ్లు తెరిచిన త‌రువాత విద్యాసంస్థ‌ల్లో క‌రోనా నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాల్లో క‌రోనా ఆంక్ష‌లు పాటిస్తూ స్కూళ్ల‌ను ఓపెన్ చేశారు.

కరోనా థర్డ్ వేవ్ కారణంగా ప్రభుత్వం ఈ నెల 30 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలను ఓపెన్ చేసుకోవచ్చని వైద్యశాఖ రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రైమరీ స్కూల్స్ మినహాయించి మిగతా విద్యా సంస్థలను ఫిబ్రవరి 1 నుంచి ఓపెన్ కాబోతున్నాయి.