బంగ్లాదేశ్‌ నుంచి వలసవచ్చిన వారి కోసం 100 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

బంగ్లాదేశ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వలసవచ్చిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ఉత్తర ప్రదేశ్‌ మాతృభూమి యోజన’ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆమోదముద్ర పడింది. 1970 దశకంలో బంగ్లాదేశ్‌(అప్పటి తూర్పు పాకిస్థాన్‌)నుంచి ఉత్తరప్రదేశ్‌కు వలస వచ్చిన 63 హిందూ బెంగాలీ కుటుంబాలను ఆదుకోవడమే ఈ పథకం ఉద్దేశం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు, ఖాన్‌పూర్‌ దేహట్‌ జిల్లాలో 121.41 హెక్టార్ల భూమి కేటాయించనుంది.