పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈ రోజు (బుధవారం) చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్‌ విజయమ్మ జెండా ఊపి పాదయత్రను ప్రారంభించారు. 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తిరిగి చేవెళ్లలోనే ముగించనున్నారు. పాదయాత్రలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 90 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. తెలంగాణలో వైఎస్సార్‌ పాలనను తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, వైఎస్సార్‌ అభిమానులు మనస్పూర్తిగా ఆశీర్వదించాలని కోరారు.