Site icon TeluguMirchi.com

రివ్యూ : పరువు – ప్రేమల మధ్య నలిగే ‘ఉప్పెన’

స్టార్ కాస్ట్ : వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి , విజయ్ సేతుపతి ‌ తదితరులు..
దర్శకత్వం : బుచ్చిబాబు
నిర్మాతలు: మైత్రి మూవీస్
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : ఫిబ్రవరి 12, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. కృతిశెట్టి కథానాయిక గా నటించగా విజయ్‌ సేతుపతి కీలకపాత్ర పోషించాడు. గతేడాది వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ కావడం ..ప్రేక్షకులు సైతం థియేటర్స్ కు అలవాటు పడడం తో ఈ సినిమాను ఈరోజు ( ఫిబ్ర‌వ‌రి 12న) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఇలా ఉంది..? వైష్ణవ్ – కృతిలా నటన ఇలా ఉంది..? సన డైరెక్షన్ ఆకట్టుకుందా..? సినిమా కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఆశి (పంజా వైష్ణవ్ తేజ్) నిరుపేద మత్స్యకారకుటుంబంలో జన్మిస్తాడు. అదే గ్రామంలో బాగా డబ్బున్న ఆసామి శేషారాయనం (విజయ్ సేతుపతి). పరువు ముఖ్యమని భావించే ఈయనకు ఒక్కగానొక్క కూతురు సంగీత (కృతి శెట్టి ). అయితే చిన్నప్పటి నుండే ఆశీ ఆమెను ప్రేమిస్తాడు. సంగీత సైతం ఆశి ని ప్రేమిస్తుంది. పరువే ముఖ్యమని భావించే తన తండ్రి మన ప్రేమను ఒప్పుకోడని , కొంతకాలం ఊరు వదిలి వెళ్లిపోతామని చెప్పి , ఆశిని తీసుకొని కొంతకాలం పాటు ఊరు వదిలి పారిపోతుంది. తన కూతురు ప్రేమించిన వాడితో ఊరు వదిలి పోయిందని..ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని శేషారాయనం అనుకుంటాడు. మరి ఆ తర్వాత కూతురు వస్తుందా..? వీరి ప్రేమను శేషారాయనం ఒప్పుకుంటాడా లేదా..? అసలు ఏంజరుగుతుంది..? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ :

మైనస్ :

సాంకేతిక వర్గం :

ఫైనల్ గా : పరువు – ప్రేమల మధ్య నలిగే ‘ఉప్పెన’

Exit mobile version