Site icon TeluguMirchi.com

రేసుగుర్రం విలన్ ఇంట్లో కరోనా కలకలం..

రేసుగుర్రం చిత్రం లో ఓ పవర్ ఫుల్  విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భోజ్ పురి స్టార్ హీరో రవి కిషన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. రవికిషన్ పీఏ కు కరోనా సోకింది. ఈ విషయాన్నిస్వయంగా ఆయనే తెలిపారు.

‘నా దగ్గర పని చేస్తున్న పీఏ గుడ్డూ పాండే(42) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో అనుమానం వచ్చి వైద్య పరీక్షలు చేయగా, అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇక తన పీఏ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే రవికిషన్‌ కూడా కరోనా టెస్ట్‌లు చేయించుకొని హోమ్ క్వారంటైన్‌కి వెళ్ళారు.

Exit mobile version