Site icon TeluguMirchi.com

విశాఖ హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ ప్రమాదం ..10 మంది మృతి

ఇటీవల కాలంలో విశాఖ నగరంలో వరుస ప్రమాదాలు అక్కడి వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొన్నటి వరకు గ్యాస్ లీక్ ఘటనలతో ఉలిక్కి పడ్డ ప్రజలు..ఈరోజు హిందూస్థాన్‌ షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ కుప్పకూలింది.

ఈ ఘటన లో 10 మంది కూలీలు మృతి చెందారు. క్రేన్‌ కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడ్డ మరి కొంతమందిని ఆస్పత్రికి తరలించారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ సంఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోపక్క ఈ ఘటన పట్ల ముఖమంత్రి జగన్ , టిడిపి అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

Exit mobile version