Site icon TeluguMirchi.com

పునీత్ అంత్యక్రియలకు హాజరుకాబోతున్న చిరంజీవి , బాలకృష్ణ

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ మరణ వార్త యావత్ సినీ ప్రేక్షకులను , అభిమానులను , సినీ ప్రముఖులను శోకసంద్రంలో పడేసింది. ఆయన పార్థీవదేహాన్ని నిన్న సాయంత్రం ఇంటికి తరలించారు. అక్కడి నుంచి అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు తీసుకెళ్లారు.

ప్రస్తుతం అక్కడ ఇసుక వేస్తే రాలనంత అభిమానులు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులు అర్పించడానికి బెంగుళూరు బయలుదేరారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో పాటు నరేష్, రాజీవ్ కనకాల, వంటి ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించనున్నారు.

Exit mobile version