ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తాజాగా మార్కెట్లోకి సరికొత్త ప్లాటినా 110 సీసీ బైక్ ను తీసుకొచ్చింది. యాంటీ–స్కిడ్ బ్రేకింగ్ వ్యవస్థ, ట్యూబ్లెస్ టైర్లు వంటి ఆకట్టుకునే ఫీచర్లతో ఈ బైక్ ను వాహన ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైక్ ధర రూ.49,197 (ఢిల్లీ ఎక్స్షోరూమ్)గా నిర్ణయించింది.
ఈ బైక్ లో మరో విశేషం ఉంది..అత్యాధునిక షాక్ అబ్జార్బర్స్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. 100 సీసీ విభాగంలో ప్రీమియం మోడల్ను కొరుకునే వినియోగదారులకు ఈ బైక్ ఒక మంచి ఆప్షన్గా నిలువనుందని సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు.