రిలయన్స్ జియోకు పోటీ ఇచ్చేందుకు ప్రవైట్ టెలికం సంస్థలే కాదు ప్రభుత్వ రంగ సంస్థ అయినా బీఎస్ఎన్ఎల్ సైతం పోటీ పడుతుంది. ఇప్పటికే పలు రకాల ఆఫర్స్ ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకోగా తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెలక్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో అందిస్తున్న రోజుకు 2.2జీబీ డాటా ఆఫర్ను ఏప్రిల్30 వరకు పొడిగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ అదనపు డాటా ఆఫర్ రూ.186, రూ.429, రూ.485, రూ.666, రూ. 999 ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్పై, రూ.187, రూ.333, రూ.349, రూ.444, రూ. 448 ప్రీపెయిడ్ ఎస్టీవీ రీఛార్జ్ పై అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వీటితో పాటు ఒక సంవత్సరం వర్తించేలా ఎస్టీవీ1699, ఎస్టీవీ2099 రీఛార్జ్లను కూడా ఈ జాబితాలో చేరుస్తున్నట్లు తెలిపింది.