Site icon TeluguMirchi.com

బైక్ ప్రియులకు కవసాకి భారీ ఆఫర్..

ఒకప్పుడు కవసాకి బైక్స్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది..కానీ ఆ తర్వాత మార్కెట్లో కి సరికొత్త ఫీచర్లతో రకరకాల కంపనీ లు పోటీపడడంతో కవసాకి బైక్స్ కు డిమాండ్ తగ్గింది. తాజాగా తమ ఉనికిని చాటుకునేందుకు తాజాగా తయారు చేసిన రెండు రకాల మోడల్స్ కు భారీ డిస్కౌంట్ తెలిపి ద్విచక్రవాహన ప్రియులను ఆకట్టుకుంటున్నారు.

నింజా జెడ్‌ఎక్స్‌-10ఆర్‌, నింజా జెడ్‌ఎక్స్‌-10ఆర్‌ఆర్‌ పేరుతో సరికొత్త మోడల్స్ ను విడుదల చేసింది. వీటి ధరలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ రెండు మోడళ్లలో మొదటి దానిపై రూ. ఆరు లక్షలు, రెండో దానిపై రూ. 5.80 లక్షలు డిస్కౌంట్ తెలిపింది. నింజా జెడ్‌ఎక్స్‌-10ఆర్‌ ధరను రూ.12.80 లక్షలు, నింజా జెడ్‌ఎక్స్‌-10ఆర్‌ఆర్‌ను రూ.16.10 లక్షలుగా నిర్ణయించారు. డిస్కౌంట్‌తో కూడిన ఈ ధరలు జూలై చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయట.

అప్పటి వరకు ప్రీ ఆర్డర్ చేసుకున్న వారికి మాత్రమే ఆ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. నింజా జెడ్‌ఎక్స్‌-10ఆర్‌ ఆకుపచ్చ రంగులో, నింజా జెడ్‌ఎక్స్‌-10ఆర్‌ఆర్‌ నల్ల రంగులోనూ మాత్రమే అందుబాటులో ఉన్నాయని, వీటిని బుక్ చేసుకోవాలనుకున్న వారు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కవసాకి డీలర్‌షిప్‌ల వద్ద ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది.

Exit mobile version