ప్రముఖ మొబైల్ సంస్థ మోటరోలా..తాజాగా 2019 చివరికల్లా భారత్ లో సరికొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకరాబోతుంది. మోటో జీ సిరీస్కు కొనసాగింపుగా జి 7, జి 7 ప్లే, జి7 ప్లస్, జి 7 పవర్ను స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. నాచ్ డిస్ప్లే లాంటి ప్రీమియం ఫీచర్లతో, ప్రీమియం ధరల్లో వీటిని తీసుకొచ్చింది.
వీటి ధరలు చూస్తే మోటో జి 7 ధర రూ. 30,748 , మోటో జి 7 ప్లే ధర రూ. 19,210 , మోటో జి 7 పవర్ ధర రూ.26, 899 , మోటో జి 7ప్లస్ ధర రూ. 19వేలు రూ.36,517 గా నిర్ణయించింది. ఈ ఏడాది చివరికల్లా ఈ ఫోన్లు వినియోగదారులకు లభ్యం కానున్నాయి.
ఫీచర్ల విషయానికి వస్తే..
మోటో జి 7 ఫీచర్లు :
* 6.24 అంగుళాల డిస్ప్లే
* ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 632
* ఆండ్రాయిడ్ 9.0 పై
* 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
* 12+5ఎంపీ రియర్ కెమెరా
* 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
మోటో జి 7 పవర్ ఫీచర్లు :
* 6.24 అంగుళాల డిస్ప్లే
* ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 636
* 16+5ఎంపీ రియర్ కెమెరా
* 12 ఎంపీ సెల్ఫీ కెమెరా
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ