ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా తాజాగా వన్ మాక్రో పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసారు. ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించిన ఈ ఫోన్ ను రూ.9,999 ధర గా నిర్ణయించారు. ఫ్లిప్కార్ట్లో ఈ నెల 12వ తేదీ నుంచి విక్రయించనున్నారు. జియో యూజర్లకు ఈ ఫోన్ కొనుగోలుతో రూ.2200 విలువైన క్యాష్బ్యాక్ వోచర్లు, 125 జీబీ అదనపు డేటాను అందివ్వనున్నారు.
ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..
* 6.2 ఇంచ్ డిస్ప్లే
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై
* 13, 2, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2
* యూఎస్బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.