పోకో నుండి ఎఫ్2 ప్రో స్మార్ట్ ఫోన్..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో తాజాగా ఎఫ్2 ప్రో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. గతంలో లాంచ్ చేసిన రెడ్ మీ కే30 ప్రో స్మార్ట్ ఫోన్ ను రీబ్రాండ్ చేసి పోకో ఎఫ్2 ప్రోగా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందు వైపు పాపప్ సెల్ఫీ కెమెరా ఫీచర్ ఉండడం విశేషం.

దీని ధర వచ్చేసి.. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 499 యూరోలుగా(సుమారు రూ.41,500) నిర్ణయించగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 599 యూరోలుగా(సుమారు రూ.50,000) నిర్ణయించారు. సైబర్ గ్రే, ఎలక్ట్రిక్ పర్పుల్, నియాన్ బ్లూ, ఫాంటమ్ వైట్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

ఫీచర్లు చూస్తే..

* 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ హెచ్ డీఆర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే
* క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్
* 8 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్
* 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లో మాత్రం ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్3.0 స్టోరేజ్ ని అందించారు.