ప్రముఖ చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షావోమి..మొబైల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు సంచనాలు సృష్టిస్తూనే ఉంది. సరికొత్త ఫీచర్లతో ..అతి తక్కువ ధరలలో ఫోన్లను తీసుకొచ్చి కస్టమర్లను ఆకట్టుకుంటూ వస్తుంది. రీసెంట్ గా 48 ఎంపీ కెమెరాతో రికార్డు క్రియేట్ చేసిన షావోమి.. ఇప్పుడు మరో రికార్డ్ నమోదు చేసేందుకు సిద్దమయ్యింది.
ప్రస్తుతం మార్కెట్ వర్గాల సమాచారం మేరకు..షావోమి 64 ఎంపీ కెమెరాతో స్మార్ట్ఫోన్ తీసుకువచ్చేందుకు సిద్దమవుతుందట. తన కొత్త రెడ్మి స్మార్ట్ఫోన్లో శాంసంగ్ కొత్త 64 ఎంపీ సెన్సర్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ తొలిగా చైనాలో అందుబాటులోకి తీసుకరావాలని చూస్తుంది. ఇండియా లో ఎప్పుడు తీసుకొస్తుంది..దీని ఫీచర్లు ఏంటి..ఖరీదు ఎలా ఉండబోతుందనేది తెలియాల్సి ఉంది.