ప్రముఖ మొబైల్ సంస్థ షావోమి కస్టమర్లకు తీపి కబురు తెలిపింది. మిడ్-రేంజ్ ఎంఐ ఏ2, ఎంఐ ఏ2 లైట్ స్మార్ట్ఫోన్లను అతి త్వరలో విడుదల చేయబోతుంది. జులై 24 న ఈ ఫోన్లను స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక ఈ రెండు ఫోన్ల ధరల విషయానికి వస్తే ఎంఐ ఏ2 (32 జిబి) స్మార్ట్ఫోన్ రూ.18,400 , షావోమి ఎంఐ ఏ2 లైట్ (64 జిబి) స్మార్ట్ఫోన్ రూ.18,400గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.
ఈ రెండు ఫోన్ల ఫీచర్స్ చూస్తే..
* 5.84 అంగుళాల డిస్ప్లే,యాంటెన్నా
* 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 625
* 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
* 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ కాంబో కెమెరా
* 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4జీబీ ర్యామ్
* 32జీబీ, 64జీబీ, 128జీబీ అంతర్గత స్టోరేజ్
* 5.99 అంగుళాల పూర్తి హెచ్డీ డిస్ప్లే
* 18:9 రేషియో, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ఎస్వోసీ సౌకర్యం ఈ ఫోన్కు ఉంటుందని కంపెనీ తెలిపింది.