
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి Anupama Parameswaran ప్రధాన పాత్రలో ఓ కొత్త ఫీచర్ ఫిల్మ్ను Ess Kay Gee Entertainment మరియు Benchmark Storytellers సంయుక్తంగా అధికారికంగా ప్రకటించాయి. ఈ చిత్రానికి ఆర్జే షాన్ దర్శకత్వం వహించనుండగా, శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రముఖ స్టూడియో భాగస్వామ్యంతో భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అనుపమ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రం ఒక ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్గా రూపుదిద్దుకోనుంది. గతంలో అనుపమ–షాన్ కాంబినేషన్లో వచ్చిన షార్ట్ ఫిల్మ్కు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు అదే జోడీ పెద్ద తెరపై మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. డిజిటల్లో హిట్ అందుకున్న ఈ కాంబో, థియేటర్లలో కూడా అదే మ్యాజిక్ను రిపీట్ చేస్తుందని చిత్ర బృందం విశ్వాసంగా ఉంది. సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుండగా, టైటిల్ను త్వరలో ప్రకటించనున్నారు.
ఇటీవలే ‘జటాధర’ మూవీని నిర్మించిన ఎస్కేజీ ఎంటర్టైన్మెంట్ తమ సంస్థ నిర్మాణంను మరింత విస్తరిస్తోంది. నిర్మాత ప్రేరణ అరోరా గతంలో రుస్తుం, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి విజయవంతమైన చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఇక అనుపమ కెరీర్ పరంగా చూస్తే, Premam, Karthikeya 2, Rakshasudu వంటి విజయాలతో అనుపమ దక్షిణాది భాషల్లో మంచి క్రేజ్ సంపాదించారు. విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె, ఈ కొత్త థ్రిల్లర్ ప్రాజెక్ట్తో మరోసారి తన నటనలో వైవిధ్యాన్ని చూపించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.
