Site icon TeluguMirchi.com

అత్యంత వేగంగా కరోనా టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్

దేశవ్యాప్తంగా 47 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా టీకాలు వేశారు. బుధవారం మొత్తంగా 2,48,662 మంది టీకాలు వేయించుకున్నారు. దీంతో మొత్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 44 లక్షలు దాటింది. ఇప్పటిదాకా కరోనా టీకాల కోసం 92,61,227 మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది నమోదు చేసుకున్నారు.

అయితే, అత్యంత వేగంగా నాలుగు మిలియన్ల (40 లక్షల) మందికి టీకాలు వేసిన దేశంగా భారత్ నిలిచింది. కేవలం 18 రోజుల్లోనే ఆ మార్క్ ను దాటి ప్రథమ స్థానంలో నిలిచింది. మంగళవారం (ఫిబ్రవరి 2) నాటికే భారత్ ఆ ఫీట్ ను సాధించింది. ఈ జాబితాలో అమెరికా రెండో స్థానాన్ని సాధించింది. ఆ దేశం 20 రోజుల్లో 40 లక్షల మందికి కరోనా టీకాలు వేసింది. బ్రిటన్, ఇజ్రాయెల్ లకు 39 రోజుల సమయం పట్టింది.

Exit mobile version